Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌ఐటీలో ర్యాగింగ్‌.. జూనియర్‌ను చితకబాదిన సీనియర్లు

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (14:21 IST)
Ragging
తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీలో ర్యాగింగ్‌ కలకలం రేగింది.  సీనియర్లు తొమ్మిది మంది కలిసి.. ఒక విద్యార్థిని చావబాదారు. ఫోన్‌ చేసి పిలిచి.. హాస్టల్‌ గదిలో దాడి చేశారు. చేతికి దొరికిన వస్తువులతో చితక్కొట్టారు. ఈ వివాదం ముందే డైరెక్టర్‌ దాకా వెళ్లినా.. పట్టించుకోకపోవడంతో దాడి వరకు వెళ్లింది.
 
వివరాల్లోకి వెళితే.. బీటెక్‌ మెకానికల్‌ సెకండియర్‌ చదువుతున్న జయకిరణ్‌కి.. సీనియర్లకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే జయకుమార్‌ను ఫ్రెండ్‌ రూమ్‌కి పిలిపించిన సీనియర్లు.. రాత్రి పది గంటల నుంచి ఉదయం పది గంటల వరకు మోకాళ్లపై కూర్చోబెట్టారు. హాస్టల్‌ గదిలో చేతికి అందిన జగ్గు, వాటర్‌ బాటిళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలు, బెల్టులతో చావబాదారు.
 
తీవ్రగాయాలపాలైన జయకిరణ్‌.. వారు విడిచిపెట్టిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments