Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతరుచేయని ఏపీ సీఎం : రఘురామ లాయర్లు

Webdunia
సోమవారం, 17 మే 2021 (18:34 IST)
సుప్రీంకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఏమాత్రం ఖాతరు చేయడం లేడని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. రఘురామను సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి పంపే బాధ్యతను సుప్రీంకోర్టు సీఎస్‌పై పెట్టినా వేగంగా స్పందించలేదని లాయర్లు వాపోయారు. 
 
ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసులో సుప్రీంకోర్టు కీలక సోమవారం ఆదేశాలు ఇచ్చింది. రఘురామ రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. 
 
జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే రఘురామకు వై కేటగిరీ భద్రతను కొనసాగించాలని సూచించింది. ఎంపీకి వైద్య పరీక్షల నిర్వహణ జరిగే కాలాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని సుప్రీం కోర్టు సూచించింది. 
 
ఈ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాటించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం మే 21కి వాయిదా వేసింది. సుప్రీం ఆదేశాలతో ఎంపీ రఘురామకృష్ణం రాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాల్సివుంది. కానీ, ఏపీ సీఎం సుప్రీంకోర్టు ఆదేశాలు పట్టించుకోలేదు. 
 
దీనిపై రఘురామ లాయర్లు మాట్లాడుతూ, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌తో తాము మాట్లాడామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తాము జ్యుడీషియల్‌ ఆఫీసర్‌ను నియమించామని కోర్టు అధికారులు రఘురామ లాయర్లకు చెప్పారు. త్వరలోనే ఉత్తర్వులు కూడా ఇస్తామన్నారని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. 
 
అలాగే, ఏపీ సీఎస్‌తో కూడా లక్ష్మీనారాయణ మాట్లాడారు. సోమవారం రాత్రిలోపు తరలిస్తామని సీఎస్‌ చెప్పారని, రఘురామ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా త్వరగా తరలించాలని కోరితే ఆయన పెద్దగా స్పందించలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని సీఎస్‌ చెప్పారని లక్ష్మీనారాయణ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments