రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌‌తో రఘురామకృష్ణ రాజు మంతనాలు, పార్టీ మారడం కోసమేనా?

Webdunia
గురువారం, 16 జులై 2020 (19:24 IST)
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు... వైసీపీ నాయకులపైనే విమర్శలు చేయడం.. తను జగన్ వలన గెలవలేదని... తనని నమ్మే ఓట్లు వేసారని సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాజాగా రఘురామకృష్ణరాజు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసారు. ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
 
అయితే... పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నందున సలహాలు, సూచనల కోసం రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశాను. రాజకీయాలు చర్చించలేదు అని ఆయన చెప్పారు. కేంద్ర బలగాలతో భద్రత కల్పించే అంశానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని... రాష్ట్రమే భద్రత కల్పిస్తామని చెబుతున్నారు. ఏమి జరుగుతుందో వేచి చూడాలి.
 
తనకు, పార్టీకి మధ్య అగాధం సృష్టించేందుకు మీడియా ప్రయత్నిస్తుందని... తను ఎప్పుడూ పార్టీని పల్లెత్తుమాట అనలేదు. మా సంసారంలో నిప్పులు పోయాలని మీడియా చూస్తుంది అటూ మీడియాపై ఫైర్ అయ్యారు. బిజెపిలో చేరే అవకాశాలు లేవు, ఒక ఎంపిగా కేంద్ర మంత్రులను కలుస్తున్నాను. అంతేతప్ప పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేసారు. 
 
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవిని ఊడగొట్టాలని కొంతమంది చూస్తున్నారు. దానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. పార్టీకి, నాకు మధ్య ఎటువంటి విభేదాలు లేవు. పార్టీకి ఎటువంటి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు.
 
పార్టీ చాలా పటిష్టంగా ఉంది. పార్టీకి, పార్టీ అధ్యక్షుడికి సలహాలు సూచనలు ఇవ్వలేదు. ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశాను. తిరుపతి భూముల విషయం, ఇసుక విషయంలో సూచనలు చేశాను. ఇసుక కార్పొరేషన్ ఏర్పాటు అయిందంటే అక్కడ తప్పు జరుగుతోందని అర్థం. పార్టీలో భాద్యత గల కార్యకర్తగా, పార్టీకి ప్రజలు దూరం కాకూడదని, పార్టీ మరో 25 సంవత్సరాలు అధికారంలో ఉండాలన్న అభిప్రాయంతో నేను ప్రభుత్వానికి సూచనలు చేశాను. నాపై ఎందుకు అనర్హత ఫిర్యాదు చేశారో అర్థం కావడంలేదు. అనర్హత పిటిషన్లో కార్టూన్లు, జోకులు తప్ప ఏమీ లేవని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments