Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ కొత్త గవర్నర్ నజీర‌ను కలిసిన వైకాపా రెబెల్ ఎంపీ రఘురామ

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (15:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‍‌ను ఏపీకి చెందిన వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మంగళవారం ఢిల్లీలో కలుసుకున్నారు. ఢిల్లీలోని జస్టిస్ నజీర్ నివాసానికి ఈ ఉదయం వెళ్లిన రఘురామరాజు పుష్పగుచ్ఛాన్ని అందించి, శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రం ఉన్న శాలువాను కప్పి గౌరవించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం మర్యాదపూర్వకంగానే గవర్నరును కలిశానని చెప్పారు. రాష్ట్ర గవర్నరుగా నియమితులైనందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అబ్దుల్ నజీర్ పలు కీలక కేసులను విచారించారు. 
 
ఇలాంటి కేసుల్లో ప్రధానంగా అయోధ్య భూవివాదం, ట్రిపుల్ తలాఖ్ వంటి కేసుల్లో ఆయన కీలక తీర్పులను వెలువరించారు. ఇప్పటివరకు ఉన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను చత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి బదిలీ చేసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments