Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలి : వైకాపా ఎంపీ

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (15:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని ఆ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌తో పాటు పలు పత్రాలను కోర్టుకు ఆయన సమర్పించారు. 
 
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ 11 ఛార్జ్ షీట్లను నమోదు చేసిందని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. అన్ని ఛార్జిషీట్లలో ఆయన ఏ-1గా ఉన్నారని తెలిపారు. జగన్ కేసుల విచారణను త్వరగా పూర్తి చేయాలని కోరారు. 
 
రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా, తమ పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే తాను పిటిషన్ వేసినట్టు ఆయన తెలిపారు. అలాగే, షరతుల బెయిల్‌ పొందిన జగన్మోహన్... అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్రభావితం చేసేలా ఈ కేసుల్లోని నిందితులకు పలు పదవులు ఇచ్చారని కోర్టు దృష్టితీసుకెళ్లారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments