Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకోవడం ఎందుకు: రఘురామ

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (16:44 IST)
తిరుమల డిక్లరేషన్‌ విషయంలో చిన్నసంతకంతో పోయే దానికి ఎందుకింత రచ్చ అని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకోవడం ఎందుకని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ తిరుమల వెళ్లినపుడు డిక్లరేషన్‌ ఇవ్వాలని కోరుతున్నట్లు రఘురామకృష్ణరాజు చెప్పారు.

దిల్లీలో రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. తితిదేలో వీవీఐపీలకు మాత్రమే డిక్లరేషన్‌ విధానం ఉందన్నారు. గత జీవోను రద్దు చేయకుండా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసే అధికారం తితిదే ఛైర్మన్‌కు లేదన్నారు. ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా నల్లబ్యాడ్జి ధరించి పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొంటానని రఘురామకృష్ణరాజు తెలిపారు.

దేవాలయాల దాడుల అంశంపై సీబీఐ విచారణ అడుగుతుంటే తమ పార్టీ వాళ్లు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఒకట్రెండు నెలల్లోనే తనను పార్టీ నుంచి బహిష్కరిస్తారని అనుకుంటున్నానని.. తనపై అనర్హత వేటు వేయించడం సాధ్యం కాదని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments