Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారు..

Webdunia
శనివారం, 28 మే 2022 (11:45 IST)
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహానాడు వేదికగా వైఎస్సార్ సర్కారుపై ఫైర్ అయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న టీడీపీ వార్షిక వేడుక మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమైందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు చంద్రబాబు సమరశంఖం పూరించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు కొత్త నినాదం ఇచ్చారు. "క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ (జగన్‌ను వదిలించుకుందాం.. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకుందాం) అని చంద్రబాబు నినాదం ఇచ్చారు. ఈ నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇక, వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. 
 
రాష్ట్రంలో ఏ రైతు ఆనందంగా లేరని.. దిక్కుతోచని పరిస్థితుల్లో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఏ రైతు అయినా ఆనందంగా ఉన్నాడా అని ప్రశ్నించారు. అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారని ఎద్దేవా చేశారు. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని చెప్పారు.  
 
మహానాడు అంటే తెలుగు జాతికి పండుగ అని పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందని.. పసుపు రంగు చూస్తేనే చైతన్యం వస్తుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments