పులివెందులకు ఉప ఎన్నిక జరగవచ్చు: రఘు రామ కృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు

సెల్వి
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (09:28 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణంరాజు పులివెందులకు ఉప ఎన్నిక జరగవచ్చని పేర్కొంటూ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని రఘు రామ కృష్ణంరాజు ఎత్తి చూపారు. 
 
ఒక ఎమ్మెల్యే అధికారికంగా సెలవు కోరకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే, వారిపై అనర్హత చర్యలు ప్రారంభించవచ్చని ఆర్ఆర్ఆర్ పేర్కొన్నారు. అలాగే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే, పులివెందులలో ఉప ఎన్నిక అనివార్యమవుతుందని రఘురామరాజు అన్నారు. 
 
అయితే, జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరై తన గళాన్ని వినిపించాలని ఆర్ఆర్ఆర్ ఆశించారు. మరోవైపు తన కస్టోడియల్ వేధింపుల కేసులో న్యాయం జరుగుతుందని రఘురామకృష్ణరాజు విశ్వాసం వ్యక్తం చేశారు. తన కస్టోడియల్ టార్చర్‌లో సునీల్ కుమార్ పాత్ర ఉందన్న రఘురామకృష్ణరాజు.. దోషులకు శిక్ష పడుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. అలాగే ఈ విషయంలో తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments