Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులివెందుల స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు..??

ఠాగూర్
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (09:22 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగున్నాయని టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. పైగా, ఆ స్థానానికి ఉప ఎన్నికలు ఎలా వస్తాయో కూడా విపులంగా వివరించారు. 
 
ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నారని, ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని వెల్లడించారు. ఓ ఎమ్మెల్యే ముందస్తు సెలవు కోరకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఉంటే ఆ ఎమ్మెల్యేపై అనర్హత ఓటు వేడుతుందని రఘురామ తెలిపారు. అందువల్ల ఈ దఫా జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రానిపక్షంలో పులివెందుల అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించి, ఉప ఎన్నిక నిర్వహించడం తథ్యమని తెలిపారు. 
 
అయితే, జగన్ అసెబ్లీ సమావేశాలకు రావాలని, తన గళం వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. కాగా, గత ఎన్నికల్లో జగన్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండాపోయింది. కానీ, తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ పట్టుబడుతూ అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొడుతున్నారు. ఆయన బాటలోనే మిగిలిన వైకాపా సభ్యులు కూడా నడుస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments