Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తితో సైకో వీరంగం...ఏడుగురిపై దాడి...కొట్టి చంపిన జనం

విశాఖపట్నంలో సైకో వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న సైకో కత్తితో ఏడుగురిపై దాడి చేశాడు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సైకోను పట్టుకుని

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (13:15 IST)
విశాఖపట్నంలో సైకో వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న సైకో కత్తితో ఏడుగురిపై దాడి చేశాడు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఆ వివరాలను పరిశీలిస్తే... విశాఖ నగరం కంచరపాలెంలో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 31 ఏళ్ల వయస్సున్న ఓ ఉన్మాది వూర్వశి జంక్షన్‌ నుంచి కంచరపాలెం మెట్టు వరకు ఏడుగురు వ్యక్తులను కత్తితో పొడిచి భయానక వాతావరణాన్ని సృష్టించాడు.
 
అతడు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో వివరాలు తెలీయదు. అతడిని చూసి స్థానికులు అరుపులు కేకలు వేయడంతో ఉన్మాది చెలరేగిపోయాడు. ఇంతలో అతడు మెట్టు వద్ద గల ఓ టీ దుకాణం నిర్వాహకుడిని కత్తితో పొడవడంతో అక్కడనున్న వారు వెంటనే పట్టుకుని సైకోని గొడ్డును బాధినట్టుబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అతడు రక్తపు మడుగులో ఉండడం చూసిన పోలీసులు వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లి పోయారు. 
 
అప్పటికే సైకో శరీరమంతా గాయాలతో రక్తస్రావమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సైకో మృతి చెందాడు. ఉన్నాది దాడిలో  తీవ్రంగా గాయపడిన బాధితుల్లో నలుగురు కేజీహెచ్‌కు తరలించగా, ముగ్గురు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సైకో వీరవిహారం చేసిన ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని గమనించిన పోలీసులు మెట్టు వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments