Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడుకు కొత్త గవర్నర్‌.. పరిశీలనలో మోత్కుపల్లి నర్సింహులు పేరు?

తమిళనాడు రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ను నియమించే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందులోభాగంగా ప్రస్తుతం మణిపూర్‌ గవర్నర్‌‌గా కొనసాగుతున్న నజ్మాహెప్తుల్లాతో పాటు.. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (13:00 IST)
తమిళనాడు రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ను నియమించే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందులోభాగంగా ప్రస్తుతం మణిపూర్‌ గవర్నర్‌‌గా కొనసాగుతున్న నజ్మాహెప్తుల్లాతో పాటు.. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్‌, టీడీపీ తెలంగాణ సీనియర్ నేత మోత్కుమల్లి నర్శింహులు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 
 
ఈ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కొణిజేటి రోశయ్య పదవీ కాలం గత ఆగస్టు 30వ తేదీతో ముగిసింది. సాధారణంగా ఒక గవర్నర్‌ పదవీకాలం ముగియగానే కొత్త గవర్నర్‌ పేరును ప్రకటించాల్సి వుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ విద్యాసాగర్‌రావుకు తమిళనాడు ఇన్‌చార్జ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. 
 
ఈ పరిస్థితుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో రాష్ట్రంలో పాలన స్తంభించిందంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తడం, రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశముండడంతో ఇక్కడ పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించాలని కేంద్రం ముమ్మరంగా కసరత్తు ప్రారంభించింది. 
 
అయితే తమిళనాడుకు మహిళనే గవర్నర్‌గా నియమించాలని ప్రధాని భావిస్తున్నారని, నజ్మాహెప్తుల్లా, ఆనందిబెన్‌ల పేర్లు ముందువరుసలో ఉన్నప్పటికీ... బీజేపీకి టీడీపీ మిత్రపక్షంగా ఉండటంతో టీడీపీ తెలంగాణ నేత మోత్కుపల్లి నర్శింహులు పేరును రాష్ట్ర గవర్నర్‌గా నియమించే అవకాశం ఉన్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. 

మీ ఫోనులో వెబ్‌దునియా తెలుగు వార్తలు, సినిమా, ఇంకా మరిన్ని విశేషాలు... మరింత వేగంగా పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments