Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవంతంగా నింగిలోకి పీఎస్ఎల్‌వీ సి-49: ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన గవర్నర్

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (17:49 IST)
శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్ఎల్‌వీ సి-49 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి ప్రయాణించడం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ హర్షం వ్యక్తం చేశారు. పీఎస్‌ఎల్‌వీ సి-49 వాహకనౌక ద్వారా 10 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టటం ముదావహమన్న గవర్నర్, ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను అభినందించారు.
 
భారత్‌కు చెందిన ఉపగ్రహం ఈవోఎస్‌-01 వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయనుండగా, ప్రయోగం సఫలీకృతం చేసిన ప్రతి ఒక్క ఇస్రో శాస్త్రవేత్త అభినందనీయుడేనన్నారు.
 
శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి సి-49ను విజయవంతంగా ప్రయోగించడం దేశ అంతరిక్ష కార్యక్రమం పట్ల వారి అంకితభావానికి నిదర్శనమని గవర్నర్ శ్రీ హరిచందన్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని గవర్నర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments