గురుపూజోత్సవం నాడు ప్రైవేట్ టీచర్ నిరసన... ప్రభుత్వం ఆదుకోవాలంటూ...

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (15:41 IST)
శ్రీకాకుళంలో గురుపూజోత్సవం నాడు ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో తెలియజేసిన నిరసన అందరికీ కళ్లుచెమర్చేలా చేస్తోంది. డా. సర్వేపల్లి రాధాకృష్ణగారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకునే టీచర్స్ డే నాడు తమలాంటి ప్రైవేట్ టీచర్లు ఎదుర్కొంటున్న అవస్థలను తెలియజేస్తూ సంతబొమ్మాళికి చెందిన ఆంగ్ల ఉపాధ్యాయులు అట్టాడ మోహనరావు తన ఆవేదనను వ్యక్తం చేశారు.
 
దివ్యాంగుడైనప్పటికీ గత 22 ఏళ్లుగా మోహనరావు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు పాఠశాలలు తెరుచుకోకపోవంతో మోహనరావు వంటి వేలాది మంది ప్రైవేట్ టీచర్లు వీధిన పడ్డారు. కుటుంబపోషణ కూడా చాలా కష్టమైన పరిస్థితి.
 
అటు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం... ఇటు ప్రభుత్వం ఎవరూ కరోనా సమయంలో ఆదుకోక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోను పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు చిరు వ్యాపారం చేసుకుందామన్నా ఆర్ధిక స్తోమత లేదని కంటతడి పెట్టుకున్నారు. దయనీయ స్థితిలో ఉన్న ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులను ప్రభుత్వమైనా ఆదుకోవాలని వేడుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ లాంటి పర్సన్ మహిళలకు బ్లెస్సింగ్ అనుకోవాలి : రశ్మిక మందన్న

రష్మిక కోసం వచ్చిన మహిళా అభిమాని.. బౌన్సర్ తోసేయడానికి ప్రయత్నిస్తే? (video)

SSMB29 చిత్రంలో ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్, గన్ ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments