Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుపూజోత్సవం నాడు ప్రైవేట్ టీచర్ నిరసన... ప్రభుత్వం ఆదుకోవాలంటూ...

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (15:41 IST)
శ్రీకాకుళంలో గురుపూజోత్సవం నాడు ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో తెలియజేసిన నిరసన అందరికీ కళ్లుచెమర్చేలా చేస్తోంది. డా. సర్వేపల్లి రాధాకృష్ణగారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకునే టీచర్స్ డే నాడు తమలాంటి ప్రైవేట్ టీచర్లు ఎదుర్కొంటున్న అవస్థలను తెలియజేస్తూ సంతబొమ్మాళికి చెందిన ఆంగ్ల ఉపాధ్యాయులు అట్టాడ మోహనరావు తన ఆవేదనను వ్యక్తం చేశారు.
 
దివ్యాంగుడైనప్పటికీ గత 22 ఏళ్లుగా మోహనరావు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు పాఠశాలలు తెరుచుకోకపోవంతో మోహనరావు వంటి వేలాది మంది ప్రైవేట్ టీచర్లు వీధిన పడ్డారు. కుటుంబపోషణ కూడా చాలా కష్టమైన పరిస్థితి.
 
అటు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం... ఇటు ప్రభుత్వం ఎవరూ కరోనా సమయంలో ఆదుకోక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోను పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు చిరు వ్యాపారం చేసుకుందామన్నా ఆర్ధిక స్తోమత లేదని కంటతడి పెట్టుకున్నారు. దయనీయ స్థితిలో ఉన్న ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులను ప్రభుత్వమైనా ఆదుకోవాలని వేడుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments