Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుపూజోత్సవం నాడు ప్రైవేట్ టీచర్ నిరసన... ప్రభుత్వం ఆదుకోవాలంటూ...

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (15:41 IST)
శ్రీకాకుళంలో గురుపూజోత్సవం నాడు ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో తెలియజేసిన నిరసన అందరికీ కళ్లుచెమర్చేలా చేస్తోంది. డా. సర్వేపల్లి రాధాకృష్ణగారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకునే టీచర్స్ డే నాడు తమలాంటి ప్రైవేట్ టీచర్లు ఎదుర్కొంటున్న అవస్థలను తెలియజేస్తూ సంతబొమ్మాళికి చెందిన ఆంగ్ల ఉపాధ్యాయులు అట్టాడ మోహనరావు తన ఆవేదనను వ్యక్తం చేశారు.
 
దివ్యాంగుడైనప్పటికీ గత 22 ఏళ్లుగా మోహనరావు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు పాఠశాలలు తెరుచుకోకపోవంతో మోహనరావు వంటి వేలాది మంది ప్రైవేట్ టీచర్లు వీధిన పడ్డారు. కుటుంబపోషణ కూడా చాలా కష్టమైన పరిస్థితి.
 
అటు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం... ఇటు ప్రభుత్వం ఎవరూ కరోనా సమయంలో ఆదుకోక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోను పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు చిరు వ్యాపారం చేసుకుందామన్నా ఆర్ధిక స్తోమత లేదని కంటతడి పెట్టుకున్నారు. దయనీయ స్థితిలో ఉన్న ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులను ప్రభుత్వమైనా ఆదుకోవాలని వేడుకున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments