Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతానం కలగలేదని గుడికి వెళ్తే.. అమరావతి గుడిలో అర్చకుడు ఎంతపని చేశాడు..

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (09:38 IST)
సంతానం కలగలేదని గుడికి వెళ్తే పూజారి ఓ మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. గుంటూరు జిల్లా అమరావతి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంతానం కోసం చేసేందుకు వచ్చిన వివాహితపై అర్చకుడు అత్యాచారయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే..విజయవాడకు చెందిన దంపతులు మంగళవారం ఉదయం గ్రామంలోని ఆలయాన్ని సందర్శించుకున్నారు. 
 
సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకుడి ఆశీస్సులు కోరి అతడి పాదాలకు నమస్కరించారు. పిల్లలు పుట్టాలంటే మహిళతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి మహిళను నమ్మించిన అర్చకుడు ఆమెను దైవసన్నిధిలోకి తీసుకెళ్లాడు. 
 
అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో జడుసుకున్న ఆ మహిళ కేకలు పెట్టడంతో అర్చకుడు పారిపోయాడు. బాధిత మహిళ కుటుంబ సభ్యులు గ్రామస్థులకు ఈ విషయం చెప్పి వెళ్లిపోయారు. విషయం దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి చేరడంతో వారు రహస్యంగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments