Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి ఎన్నికలు.. ద్రౌపది ముర్ముతో వైసీపీ ఎమ్మెల్యేల భేటీ

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (12:20 IST)
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని ఇప్పటికే  టీడీపీ నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు జరిగిన టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో  ఈ నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము బరిలో దిగింది. 
 
విపక్ష పార్టీల తరపున మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా ద్రౌపది ముర్ముకు మద్దతును ప్రకటించింది. 
 
ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమంలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల తరపున  యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపారు. 
 
ఏపీ రాష్ట్రంలో వైసీపీకి 151 ఎమ్మెల్యేలు,  పార్లమెంట్ లో 22 ఎంపీల బలం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏర్పాటు చేసే ఎలక్టోరల్ కాలేజీలో వైఎస్ఆర్‌సీపీకి ఉన్న ఓట్ల విలువ 43,674 గా ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో వైఎస్ఆర్‌సీపీ ఓట్ షేర్  విలువ 4 శాతంగా ఉంది. 
 
టీడీపీకి ఏపీ అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌లో ముగ్గురు ఎంపీలున్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్‌సీపీకి మద్దతు పలికారు. ఈ ఎన్నికల్లో పార్టీ విప్  కూడా చెల్లదు. వైఎస్ఆర్‌సీకి మద్దతు నిలిచిన అభ్యర్ధులు కూడా ఎన్డీఏ అభ్యర్ధికే మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఇందులో భాగంగా వైకాపా ఎమ్మెల్యేలతో ద్రౌపది ముర్ము భేటీ అయ్యే ఛాన్సుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments