Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ రాజీనామా

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (13:10 IST)
పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ప్రధాన సలహాదారు పదవికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ రాజీనామా చేశారు. ప్రజా జీవితంలో పోషించిన చురుకైన పాత్ర నుండి తాత్కాలిక విరామం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 
 
అమరీందర్‌ సింగ్‌కు రాసిన లేఖలో... తన తదుపరి చర్యల గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు. 'మీకు తెలిసినట్లుగా.. ప్రజా జీవితంలోని క్రియాశీల పాత్ర నుండి కొంత విరామం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ మేరకు మీ ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌గా బాధ్యతలు నిర్వర్తించలేను. అదేవిధంగా భవిష్యత్తులో చేపట్టే కార్యాచరణపై కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నా బాధ్యతల నుండి తప్పిస్తారని ఈ లేఖ రాస్తున్నాను' అని పేర్కొన్నారు. 
 
వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రశాంత్‌ చర్య.. ముఖ్యమంత్రిని నైరాశ్యంలోకి నెట్టినట్లైంది. సిద్దుతో విబేధాలు పొడిచూపిన సమయంలో.. మార్చిలో ప్రశాంత్‌ కిశోర్‌ను ప్రధాన సలహాదారుగా అమరీందర్‌ నియమించుకున్నారు. 
 
అయితే ప్రశాంత్‌ కిశోర్‌ సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం ఆయన చూపంతా 2024 సార్వత్రిక ఎన్నికలు, ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం పైనే కేంద్రీకరించినుట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామాచేశారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

ఎ.ఆర్. రెహమాన్ లా గాయకులతో హరి హర వీరమల్లు పాటను పాడించిన కీరవాణి

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments