విద్యార్థిని ఆత్మహత్య.. చంద్రబాబు ఫైర్..

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (21:29 IST)
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ ఇంజనీరింగ్ కాలేజీ ధన దాహానికి ఓ విద్యార్థిని బలైంది. కాలేజీ ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యం ఒత్తిడి చేయడంతో బిటెక్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటంతో కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఒంగోలులోని గొడుగుపాలెంకు చెందిన తేజశ్రీ అనే విద్యార్థిని క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది.
 
గత ఏడాది తేజశ్రీకి ఫీజురీయంబర్స్ మెంట్ వచ్చింది. అయితే ఈ ఏడాది ఫీజు రీయంబర్స్ మెంట్ రాలేదు. దీంతో కాలేజీ యాజమాన్యం ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తాళలేక తేజశ్రీ తల్లి విజయ కుమారి అప్పులు చేసి నిన్న ఫీజులో కొంత భాగం చెల్లించింది. ఇదే విషయం నిన్న రాత్రి ఇంట్లో చర్చకు వచ్చింది.
 
ఒక వైపు ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యం ఒత్తిడి, మరో వైపు తల్లి ఆర్థిక ఇబ్బందులు చూసి తట్టుకోలేక తేజశ్రీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఫీజుల చెల్లింపుపై ఒత్తిడి చేసిన కాలేజీ యాజమాన్యంపై చంద్రబాబు మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments