Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థిని ఆత్మహత్య.. చంద్రబాబు ఫైర్..

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (21:29 IST)
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ ఇంజనీరింగ్ కాలేజీ ధన దాహానికి ఓ విద్యార్థిని బలైంది. కాలేజీ ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యం ఒత్తిడి చేయడంతో బిటెక్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటంతో కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఒంగోలులోని గొడుగుపాలెంకు చెందిన తేజశ్రీ అనే విద్యార్థిని క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది.
 
గత ఏడాది తేజశ్రీకి ఫీజురీయంబర్స్ మెంట్ వచ్చింది. అయితే ఈ ఏడాది ఫీజు రీయంబర్స్ మెంట్ రాలేదు. దీంతో కాలేజీ యాజమాన్యం ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తాళలేక తేజశ్రీ తల్లి విజయ కుమారి అప్పులు చేసి నిన్న ఫీజులో కొంత భాగం చెల్లించింది. ఇదే విషయం నిన్న రాత్రి ఇంట్లో చర్చకు వచ్చింది.
 
ఒక వైపు ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యం ఒత్తిడి, మరో వైపు తల్లి ఆర్థిక ఇబ్బందులు చూసి తట్టుకోలేక తేజశ్రీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఫీజుల చెల్లింపుపై ఒత్తిడి చేసిన కాలేజీ యాజమాన్యంపై చంద్రబాబు మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments