Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐడీ కస్టడీకి పోసాని కృష్ణమురళి.. ఒక రోజు విచారణకు అనుమతి!

ఠాగూర్
మంగళవారం, 18 మార్చి 2025 (16:02 IST)
సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళిని ఏపీ సీఐడీ పోలీసులు తమ కస్టడీలోకి
 తీసుకున్నారు. దీంతో ఆయన వద్ద ఒక్క రోజు పాటు విచారణ సాగనుంది. విచారణ నిమిత్తం పోసానిని తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పోలీసులు గుంటూరు సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానికి కోర్టు ఆమోదం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో మంగళవారం సీఐడీ పోలీసులు పోసానిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. తొలుత పోసానిని గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత తమ కార్యాలయానికి తీసుకెళ్లి పోసాని వద్ద విచారణ జరుపుతున్నారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లు, వారి కుటుంబ సభ్యులను అనుచితంగా, అసభ్య పదజాలంతో దూషించిన విషయం తెల్సిందే. పైగా, మార్ఫింగ్ చేసిన ఫోటోలను మీడియా ముందు ప్రదర్శించారు. ఈ అంశాలపై టీడీపీ, జనసేన పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో పోసానిపై ఏపీ వ్యాప్తంగా 17కు పైగా కేసులు నమోదైవున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోసానికి సీఐడీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. 
గుంటూరు జిల్లా జైలు నుంచి పోసాని కృష్ణమురళిని కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments