Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే... జగన్ నడుస్తున్న దారి నాకు ఏమీ నచ్చడంలేదు, వైకాపాకు గుడ్‌బై చెప్పిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే

వరుణ్
బుధవారం, 24 జులై 2024 (16:38 IST)
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి షాకులు మొదలయ్యాయి. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య తేరుకోలేని షాకిచ్చారు. పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గుంటూరులో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, గుంటూరు లోక్‌సభ వైకాపా ఇన్‌చార్జ్ కిలారి రోశయ్య తీవ్ర విమర్శలు చేశారు. 
 
'వైకాపా కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తుంది. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉండదు. ఉమ్మారెడ్డి అనుభవాన్ని వినియోగించుకోలేదు. మండలిలో ప్రతిపక్ష నేత విషయంలో కనీసం చర్చించలేదు. మండలిలో చైర్మన్ అన్నారు. ప్రతిపక్ష నేతగా కూడా ఉమ్మారెడ్డికి అవకాశం ఇవ్వలేదు. గుంటూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా తనను నిలబెట్టారు. కొందరు మానసికంగా కుంగదీశారు. ఎన్నికల తర్వాత కూడా వారి ఇష్టాలతోనే పార్టీ నడుపుతున్నారు. వైకాపాలో నేను కొనసాగలేను' అని రోశయ్య స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్కినేని నాగేశ్వర రావు 100వ పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా ఘన నివాళులు

మృత్యుముఖంలో ఉన్న అభిమానికి.. వీడియో కాల్ చేసిన హీరో! (Video)

హెచ్. వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి చిత్రం ప్రకటన - 2025 అక్టోబ‌ర్ లో రిలీజ్

హీరో విజయ్ 69వ చిత్రంపై అధికారిక ప్రకటన

సిద్దు జొన్నలగడ్డ, నీరజ కోన కాంబోలో తెలుసు కదా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

దానిమ్మ పువ్వు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే?

నాణ్యతకు భరోసా: బ్రాండెడ్ టీ ప్యాకేజీలను కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

Chicken Pepper Fry.. ఎలా చేయాలి.. ఆరోగ్య ప్రయోజనాలేంటి?

డెంగ్యూ వచ్చిందని గ్లాసెడు బొప్పాయి రసం ఒకేసారి తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments