Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర విభజన ముగిసిన అధ్యాయం : పొన్నం ప్రభాకర్

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (10:23 IST)
రాష్ట్ర విభజన అనేది ఓ ముగిసిన అధ్యాయం అని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. అందువల్ల ఏపీ పాలకులు, ఇటు తెలంగాణ పాలకులు ఇరు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ఆయన కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ కోరుకుంటున్నామంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ స్పందించారు. 
 
రెండు రాష్ట్రాలు మళ్లీ కలవడం అనే అంశానికి ఇక భవిష్యత్తులో తావు లేదన్నారు. పార్లమెంటులో ప్రజాస్వామ్య పద్దతిలో రాష్ట్రాల ఏర్పాటు జరిగిందన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో ఓ కేసు ఉండొచ్చు. ఇంకేవైనా న్యాయపరమైన అంశాలు జరుగుతుండొచ్చు. కానీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రెండు రాష్ట్రాలు ఏర్పడి, రెండు ప్రభుత్వాలు ఎన్నికైనపుడు మళ్లీ ఉమ్మడి రాష్ట్రం అంటూ కొత్త పల్లవి అందుకోవడం విచిత్రంగా ఉందన్నారు. 
 
సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణాపై మరోమారు దాడికి కుట్రగానే భావించాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రా బాగుండాలి.. తెలంగాణ బాగుండాలి అని కోరుకోవాలి. కానీ వైకాపా ఉమ్మిడి రాష్ట్రం అంటోందంటే తెలంగాణపై మళ్లీ రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తుందనే అర్థం అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments