చంద్రగిరిలో చంద్రబాబు సోదరిని కూడా వదలని సీఐడీ

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (12:12 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాష్ట్ర సీఐడీ వెంటాడుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం అసైన్డ్ భూములను లబ్దిదారులను బెదిరించి తక్కువ ధరకు కొనుగోలు చేశారన్న ప్రధాన అభియోగంపై బాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో చంద్రగిరి మండలం కందులవారిపల్లెలో ఉంటున్న చంద్రబాబునాయుడు సోదరి హైమావతిని కూడా సీఐడీ పోలీసులు వదిలిపెట్టలేదు. ఆమె ఇంటికి పోలీసులు వచ్చి ఫొటోలు తీయడం కలకలం రేపింది. 
 
మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి పోలీసులమని కాపలాదారుకు చెప్పి లోపలికి వెళ్లారు. అయితే, ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఉండటంతో మళ్లీ బయటకు వచ్చి పరిసరాలను ఫొటోలు తీశారు.
 
అనంతరం హైమావతి ఇంటి కాపలాదారు రవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు సందర్భంగా సీసీటీవీ పుటేజీలను పోలీసులకు రవి అందించాడు. 
 
ఈ ఘటనపై సీఐ రామచంద్రారెడ్డి వివరణ ఇస్తూ.. నారావారిపల్లెలోని చదలవాడ సుచరిత ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి గొడవ చేస్తున్నట్టు తమకు సమాచారం అందిందని, అయితే తమ సిబ్బంది పొరపాటున నారావారిపల్లెకు కాకుండా కందులవారి పల్లెకు వెళ్లారని అన్నారు. హైమావతి కుమార్తె పేరు కూడా సుచరిత కావడంతో ఆమె ఇంటికి వెళ్లారని సీఐ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments