Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రగిరిలో చంద్రబాబు సోదరిని కూడా వదలని సీఐడీ

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (12:12 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాష్ట్ర సీఐడీ వెంటాడుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం అసైన్డ్ భూములను లబ్దిదారులను బెదిరించి తక్కువ ధరకు కొనుగోలు చేశారన్న ప్రధాన అభియోగంపై బాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో చంద్రగిరి మండలం కందులవారిపల్లెలో ఉంటున్న చంద్రబాబునాయుడు సోదరి హైమావతిని కూడా సీఐడీ పోలీసులు వదిలిపెట్టలేదు. ఆమె ఇంటికి పోలీసులు వచ్చి ఫొటోలు తీయడం కలకలం రేపింది. 
 
మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి పోలీసులమని కాపలాదారుకు చెప్పి లోపలికి వెళ్లారు. అయితే, ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఉండటంతో మళ్లీ బయటకు వచ్చి పరిసరాలను ఫొటోలు తీశారు.
 
అనంతరం హైమావతి ఇంటి కాపలాదారు రవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు సందర్భంగా సీసీటీవీ పుటేజీలను పోలీసులకు రవి అందించాడు. 
 
ఈ ఘటనపై సీఐ రామచంద్రారెడ్డి వివరణ ఇస్తూ.. నారావారిపల్లెలోని చదలవాడ సుచరిత ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి గొడవ చేస్తున్నట్టు తమకు సమాచారం అందిందని, అయితే తమ సిబ్బంది పొరపాటున నారావారిపల్లెకు కాకుండా కందులవారి పల్లెకు వెళ్లారని అన్నారు. హైమావతి కుమార్తె పేరు కూడా సుచరిత కావడంతో ఆమె ఇంటికి వెళ్లారని సీఐ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments