Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు పేకాట ఆడుతూ కనిపించారు.. పోలీసులు ఏం చేశారంటే?

Webdunia
మంగళవారం, 28 మే 2019 (12:17 IST)
విశాఖ జిల్లా అరిలోవలో పేకాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసారు. దాడి చేసిన పోలీసులకు కొంతమంది మహిళలు పేకాడుతూ కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై వారిపై కేసు పెట్టి వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడిచిపెట్టేశారు. 
 
ఈ సందర్భంగా ఆ మహిళల సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పరిశీలించగా అనేక విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. పేకాట కేసులో పట్టుబడిన మహిళల్లో కొందరు గంజాయి రవాణా, వ్యభిచారం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించినట్టు సమాచారం.
 
దీనిపై పోలీసులు ఇప్పటికే తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా దీని గురించి రహస్యంగా మరింత లోతైన విచారణ జరపాలని సీఐని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామకృష్ణాపురంలో పేకాటడుతున్న కొంతమంది మహిళలను ఆరిలోవ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదుచేశారు. 
 
అయితే మహిళలకు సంబంధించిన విషయం కావడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం గుట్టుగా దీనికి సంబంధించిన తీగను లాగుతున్నట్టు తెలిసింది. దీనిపై సీఐ అశోక్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా అలాంటిదేమీ లేదంటూ సమాధానం దాటవేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments