Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు పేకాట ఆడుతూ కనిపించారు.. పోలీసులు ఏం చేశారంటే?

Webdunia
మంగళవారం, 28 మే 2019 (12:17 IST)
విశాఖ జిల్లా అరిలోవలో పేకాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసారు. దాడి చేసిన పోలీసులకు కొంతమంది మహిళలు పేకాడుతూ కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై వారిపై కేసు పెట్టి వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడిచిపెట్టేశారు. 
 
ఈ సందర్భంగా ఆ మహిళల సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పరిశీలించగా అనేక విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. పేకాట కేసులో పట్టుబడిన మహిళల్లో కొందరు గంజాయి రవాణా, వ్యభిచారం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించినట్టు సమాచారం.
 
దీనిపై పోలీసులు ఇప్పటికే తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా దీని గురించి రహస్యంగా మరింత లోతైన విచారణ జరపాలని సీఐని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామకృష్ణాపురంలో పేకాటడుతున్న కొంతమంది మహిళలను ఆరిలోవ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదుచేశారు. 
 
అయితే మహిళలకు సంబంధించిన విషయం కావడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం గుట్టుగా దీనికి సంబంధించిన తీగను లాగుతున్నట్టు తెలిసింది. దీనిపై సీఐ అశోక్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా అలాంటిదేమీ లేదంటూ సమాధానం దాటవేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments