Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సగ్గుబియ్యంలోని ఆరోగ్య ప్రయోజనాలు.. బరువు పెరగాలనుకుంటే?

Advertiesment
Sabudana
, శనివారం, 25 మే 2019 (16:28 IST)
సగ్గుబియ్యంలో వున్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే. సగ్గుబియ్యం బరువు పెరగాలనుకునే వారికి బాగా పనిచేస్తుంది. బరువు పెరగాలనుకునేవారు రోజూ ఓ కప్పు ఉడికించిన సగ్గుబియ్యం తీసుకోవచ్చు. అలానే సగ్గుబియ్యంలో లభించే ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి గర్భిణీ మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. 
 
గర్భస్థ శిశువు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. సగ్గుబియ్యంలో లభించే ఇనుము, క్యాల్షియం, విటమిన్ కె వంటివి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అధికరక్తపోటుని తగ్గిస్తాయి. దీనిలో లభించే క్యాల్షియం రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది. శాకాహారం తినేవారికి మాంసకృత్తులు తగినన్ని శరీరానికి అందవు. 
 
ఇలాంటప్పుడు సగ్గుబియ్యాన్ని రోజూ ఏదో ఒకరూపంలో ఆహారంలో భాగం చేసుకుంటే వాటిల్లోని మాంసకృత్తులు శక్తిని ఇవ్వడమే కాదు కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దోసకాయ రొయ్యల కూర ఎలా చేయాలో తెలుసా?