Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత : రైతు చేయి విరగ్గొట్టిన పోలీసులు

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (13:09 IST)
రాజధాని అమరావతి ప్రాంత పరిరక్షణ కోసం ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహాపాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చదలవాడ వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. 
 
ఈ క్రమంలో సంతనూతలపాడుకు చెందిన నాగార్జున అనే రైతు చేయివిరిగింది. ప్రశాంతంగా సాగుతున్న మహా పాదయాత్ర రైతులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా లాఠీచార్జ్‌లు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
 
మరోవైపు పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వచ్చే గ్రామాల ప్రజలను పోలీసులు ఎక్కడకక్కడ అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
 
అయినప్పటికీ మొక్కవోని సంకల్పంతో పోలీసుల ఆంక్షల నడుమే రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. పోలీసులను తోసుకుంటూ రైతులు ముందుకు కదులిపోతున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా న్యాయస్థానం టు దేవస్థానం వరకు ఈ పాదయాత్రను చేసి తీరుతామని రైతులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments