Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహా ఏమి విచిత్రం... రాజకీయ నేత కటౌట్‌కు 15 మంది ఖాకీల భద్రత!

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (11:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా నేతలు తమ అధికార దర్పాన్ని బాగానే ప్రదర్శిస్తున్నారు. తమ ఏలుబడిలో తాము చెప్పిందే వేదమన్నట్టుగా నడుచుకుంటున్నారు. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. దాన్ని పక్కన బెట్టి రాజకీయ నేతల కటౌట్ల భద్రతలో నిమగ్నమయ్యారు. ఈ వింత దృశ్యం జిల్లా కేంద్రమైన నెల్లూరులో కనిపించింది. స్థానిక నర్తకి థియేటర్ సెంటరులో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు 15 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దీనికి 15 మంది పోలీసులు కాపలాగా ఉంటున్నారు. వీరిలో ఒకరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కూడా ఉండటం గమనార్హం. 
 
రెండు రోజుల క్రితం అనిల్ కుమార్ జన్మదినం సందర్భంగా నెల్లూరు నగర వ్యాప్తంగా ఆయన కటౌట్లు బ్యానర్లతో నింపేశారు. నర్తకి సెంటరులో అయితే, ఏకంగా భారీ కటౌట్‌ను ఏర్పాటుచేశారు. అయితే,ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి అనిల్ కటౌట్ అడ్డుగా ఉందని, దాన్ని తొలగించాలంటూ నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులను టీడీపీ నగర ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోరారు. కానీ వారు పట్టించుకోలేదు.
 
ఈ క్రమంలో తాజాగా టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం నర్తకి సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఎవరైనా అనిల్ కుమార్ యాదవ్ కటౌట్‌ను కూల్చివేస్తారన్న అనుమానంతో పోలీసులు ఏకంగా 15 మందితో పోలీసులు పహారాగా ఉన్నారు. ఈ వార్త స్థానిక పత్రికలతో పాటు టీవీల్లో రావడంతో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments