Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడులో రోడ్డుపక్కనే మంటల్లో కాలిపోయిన వ్యక్తి...

ఠాగూర్
బుధవారం, 25 జూన్ 2025 (14:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా యడ్లపాడు సమీపంలో ఓ గుర్తు తెలియని యువకుడు మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. 16వ నంబరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన డ్రైన్‌లో ఫ్లెక్సీలు చుట్టి ఉంచిన మృతదేహం ఒకటి బుధవారం ఉదయం మంటల్లో కాలుతూ కనిపించింది. దీనిపై సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు వెంటనే మంటలు ఆర్పివేశారు. అప్పటికే మృతదేహం చాలా భాగం కాలిపోయింది. 
 
నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వర రావు, చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారాయడు, యడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్య చేసి మృతదేహాన్ని వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ తగలబెట్టారా? లేక ఇక్కడే హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారా? అనే కోణంలో దర్యప్తు చేస్తున్నారు. 
 
ముఖం వరకు కాలిపోకుండా చూడటంతో కొద్దిగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి వయసు 35 యేళ్ల వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించామని దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉన్మాదిగా మారిన కిట్టు ఆరాధ్యను ఏం చేశాడు? ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్

బాలీవుడ్ నటి సనా ఖాన్‌కు మాతృవియోగం

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments