Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు

Advertiesment
jagan

ఠాగూర్

, మంగళవారం, 24 జూన్ 2025 (14:08 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. గత ఫిబ్రవరి 19వ తేదీన ఆయన గుంటూరు జిల్లా మిర్చియార్డు పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ, పోలీసుల అనుమతి లేకుండా ఈ పర్యటనకువచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైకాపా నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 
 
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్పప్పటికీ వైకాపా నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావుడి చేశారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్‌తో పాటు నేతలు అంబటి రాంబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, కావడి మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదైంది.
 
ఇప్పటికే పోలీసులు వారికి 41ఏ నోటీసులు ఇచ్చారు. పిలిచినపుడు నల్లపాడు ఠాణాకు విచారణకు రావాలని సూచించారు. కాగా, పల్నాడు జిల్లాలోని రెంటపాళ్లలో జగన్ పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా చిలీ సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కింద పడి మృతి చెందాడు. దీనిపై జగన్‌పై ఇప్పటికే కేసు నమోదైన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లై నెల రోజులే: గద్వాలలో భర్తను చంపి అతడి మృతదేహంతో కారులో భార్య, ప్రియుడు (video)