Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్‌బాబు ఫాంహౌస్‌లోకి దూసుకెళ్లిన ముగ్గురు అగంతకుల అరెస్టు!!

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2020 (11:41 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది సెలెబ్రిటీలకు ముఖ్యంగా, హీరోలకు ప్రత్యేకంగా ఫాంహోస్‌లు ఉన్నాయి. అలాంటి వారిలో హీరో డాక్టర్ మోహన్ బాబు ఒకరు. అయితే, ఈయన ఫాంహౌస్‌లోకి శనివారం రాత్రి ఇన్నోవా కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు దూసుకెళ్లారు. దీనిపై మోహన్ బాబు ఫిర్యాదు మేరకు పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి, నలుగురు వ్యక్తుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు 
 
సీసీటీవీ దృశ్యాలు, కారు నంబరు ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులంతా మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్‌కు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల కాల్‌డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ అగంతకులు వచ్చిన కారు ఓ మహిళ పేరుతో రిజిస్టరై వున్నట్టు పోలీసులు కనుగొన్నారు. 
 
కాగా, నిన్న రాత్రి  మోహన్‌బాబు ఫాంహౌస్‌లోని ఇంట్లోకి దూసుకెళ్లిన ఆ నలుగురు యువకులు ‘మిమ్మల్ని వదలం’ అంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో మోహన్‌బాబు కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments