భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. భద్రాద్రి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పెద్దవాగులో భారీగా నీరు చేరింది. దీంతో బచ్చువారిగూడెం-నారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
అలాగే వరదలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అధికార యంత్రాంగంతో కలిసి స్వయంగా రంగంలోకి దిగిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. వరదలో చిక్కుకున్న గ్రామ ప్రజలందరని సురక్షిత ప్రాంతాలకి అధికారులు తరలించారు.
ఈ సందర్భంగా వరద ప్రాంతాల్లో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తూ.. వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు.