Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో మోడీ పర్యటన వాయిదా పడుతోందా?

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (11:51 IST)
భారత ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 6వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. ఇప్పటికే తెలుగుదేశం బీజేపీ వర్గాలు మోడీ పర్యటనపై  కత్తులు దూసుకుంటున్నాయి. ఏ మొహం పెట్టుకుని మోడీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తారని తెలుగుదేశం వర్గాలు విమర్శిస్తుంటే.. గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది చెప్పడానికే మోడీ పర్యటనకు వస్తున్నారని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. 
 
రాష్ట్రానికి నరేంద్రమోడీ అన్యాయం చేశారంటూ ప్రతిరోజూ గగ్గోలు పెడతున్న తెలుగుదేశం నేతలు తాజగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో మోడీ పర్యటనపై తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. అయితే జనవరి 6 వతేదీన ఏపీలో మోడీ పర్యటన వాయిదా పడ్డట్టు సమాచారం. అదే రోజు ప్రధాని కేరళ పర్యటన ఉన్నందున సమయాభావం మూలంగా మరొక తేదీ ఖరారు చేయడానికి ప్రధాని కార్యాలయ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 
 
ఈ మేరకు ఇప్పటికే ఏపీ బీజేపీ నాయకత్వానికి సమాచారం పంపింది ప్రధాని కార్యాలయం, అయితే ఆంధ్రప్రదేశ్  పర్యటనను యధావిధిగా ఉంచాలని కేరళ పర్యటనను వాయిదా వేయాలని ప్రధాని కార్యాలయ అధికారులను ఏపీ బీజేపీ నాయకత్వం కోరింది. అయితే అన్ని విషయాలు పరిశీలించి మోడీ పర్యటనను ఖరారు చేయనున్నారు ప్రధాని కార్యాలయం అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments