Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మృతి - సంతాపం తెలిపిన జగన్ - బాబు

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (10:52 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకులోనై ఆస్పత్రిలో చేరిన ఆమె శుక్రవారం వేకువజామున 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. మరణవార్త తెలుసుకున్న వెంటనే ప్రధాని మోడీ హుటాహుటిన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన స్వయంగా తల్లి పాడెమోశారు. తల్లిని కోల్పోయి బాధలో ఉన్న ప్రధాని మోడీకి పలువురు ప్రముఖులు తమ సానుభూతిని తెలుపుతున్నారు.
 
ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ కష్ట సమయంలో తమ ప్రార్థనలు మోడీ కుటుంబంతో ఉంటాయని చెప్పారు. హీరాబెన్ మోడీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాని ట్వీట్ చేశారు. 
 
అలాగే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. తల్లిని కోల్పోవడంతో ఎవరికైనా అత్యంత బాధాకరమని చెప్పారు. మాతృమూర్తిని కోల్పోయిన ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. మోడీ కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments