Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మృతి - సంతాపం తెలిపిన జగన్ - బాబు

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (10:52 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకులోనై ఆస్పత్రిలో చేరిన ఆమె శుక్రవారం వేకువజామున 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. మరణవార్త తెలుసుకున్న వెంటనే ప్రధాని మోడీ హుటాహుటిన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన స్వయంగా తల్లి పాడెమోశారు. తల్లిని కోల్పోయి బాధలో ఉన్న ప్రధాని మోడీకి పలువురు ప్రముఖులు తమ సానుభూతిని తెలుపుతున్నారు.
 
ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ కష్ట సమయంలో తమ ప్రార్థనలు మోడీ కుటుంబంతో ఉంటాయని చెప్పారు. హీరాబెన్ మోడీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాని ట్వీట్ చేశారు. 
 
అలాగే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. తల్లిని కోల్పోవడంతో ఎవరికైనా అత్యంత బాధాకరమని చెప్పారు. మాతృమూర్తిని కోల్పోయిన ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. మోడీ కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments