Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీతో ఒరిగిందేమీ లేదు.. ఓట్లు అదనంగా పడలేదు: చంద్రబాబు

రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే బీజేపీతో స్నేహాన్ని కొనసాగించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే బీజేపీ స్నేహం వల్ల ఒరిగిందేమీ లేదని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 సాధారణ ఎన

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (12:51 IST)
రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే బీజేపీతో స్నేహాన్ని కొనసాగించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే బీజేపీ స్నేహం వల్ల ఒరిగిందేమీ లేదని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 సాధారణ ఎన్నికలకన్నా ముందే జరిగిన స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 
 
బీజేపీతో పొత్తు లేకుండా బరిలోకి దిగిన సమయంలో ఎన్ని ఓట్లు పడ్డాయో.. అదే ఓట్లే పొత్తుకు తర్వాత కూడా వచ్చాయని.. బీజేపీ వల్ల అదనంగా ఎలాంటి ఓట్లు రాలేదని మంత్రులు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయినప్పటికీ రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో  ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నారు.
 
హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామంటేనే కేంద్ర ప్రతిపాదనలకు అంగీకరించామని చంద్రబాబు మరోసారి గుర్తు చేశారు. ఈఏపీ ద్వారా నిధులు ఇస్తామని ఏడాదిన్నర క్రితం కేంద్రం హామీ ఇచ్చిందని.. కానీ ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని నిప్పులు చెరిగారు. యూసీలు కావాలని కేంద్రం అడిగిన ప్రతిసారీ, ఎప్పటికప్పుడు స్పందించి పంపుతూనే ఉన్నామని తెలిపారు. రాష్ట్రానికి సాయం చేసి ఆదుకోవాల్సింది పోయి.. బీజేపీ ఎదురుదాడికి దిగుతుందని చంద్రబాబు మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments