Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్, ఇండియా విభ‌జ‌న క‌ష్టాలు ఇంకా మ‌ర్చిపోలేం!

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (15:15 IST)
విభ‌జ‌న క‌ష్టాల‌ను ఇంకా మ‌ర్చి పోలేం... ఈ మాట అన్న‌ది ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురించి కాదు... భార‌త దేశం గురించి... అన్న‌ది ఎవ‌రో కాదు... భార‌త ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

ఆగ‌స్టు 14న విభజన భయానక జ్ఞాపక దినంగా పాటించాలని ప్ర‌ధాని పిలుపునిచ్చారు. పాకిస్తాన్‌ ఇండియా విభజన సందర్బంగా ప్రజలు బాధలను, కష్టాలను ఎప్పటికీ మర్చిపోలేమని గుర్తుచేసుకున్న ప్రధాని, ఆగ‌స్టు 14వ తేదీని విభ‌జ‌న స్మృతి దివస్‌గా జ‌రుపుకోవాల‌ని ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు.

దేశ చ‌రిత్ర‌లో విభజన కష్టాలను ఎన్న‌టికీ మ‌ర్చిపోలేమ‌ని, విభజన సమయంలో ప్ర‌జ‌ల పోరాటం, త్యాగాల‌ను గుర్తు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది సోదర సోదరీ మణులు విడిపోవాల్సి వచ్చింది. అప్పటి ద్వేషం, హింస కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ట్వీట్‌ చేశారు. వారి త్యాగాల‌ను స్మరించుకుంటూ ఆగ‌స్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్‌గా జ‌రుపు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాని మోదీ ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా సామాజిక విభేదాలు, అసమానతలు అనే విషాన్ని తొలగించడంతోపాటు, ఏకత్వం, సామాజిక సామరస్యం, మానవ సాధికారతా స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకోవాల్సి అవసరం ఉందని ప్రధాని మోదీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments