Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెల్ఫీ ప్లీజ్! వెలిగిపోతున్న వెల‌గ‌పూడి ఏపీ సెక్ర‌టేరియేట్!

Advertiesment
ap
విజయవాడ , శనివారం, 14 ఆగస్టు 2021 (14:43 IST)
స్వాంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఏపీ సెక్ర‌టేరియేట్ ను సుంద‌రంగా తీర్చిదిద్దారు. వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యంలో ఆగ‌స్టు 15న పంద్రాగ‌స్టు జ‌రిపేందుకు అధికార యంత్రాంగం సిద్ధం అయింది.

వెల‌గపూడి స‌చివాల‌యం అంతా ఇపుడు వెలిగిపోతోంది. రంగురంగుల కాంతులీనే విద్యుత్ దీపాల‌తో స‌చివాల‌యం దేదీప్య‌మానంగా వెలిగిపోతోంది. ఏటా ఆగ‌స్టు 15, జ‌న‌వ‌రి 26న స‌చివాల‌యాన్ని విద్యుత్ దీపాల‌తో అలంక‌రిస్తారు.

అయితే, ఈ సారి మ‌రింత ఆకర్ష‌ణ‌గా లైటింగ్ అమ‌ర్చారు. దీనితో ప‌లువురు సంద‌ర్శ‌కులు స‌చివాల‌యానికి చేరి రంగుల భ‌వ‌నాల‌ను ఆస‌క్తిగా చూస్తున్నారు. కొంద‌రు అయితే, ఈ విద్యుత్ దీపాల అలంక‌ర‌ణ‌లో స‌చివాల‌యాన్ని చూసి మంత్ర ముగ్దుల‌వుతున్నారు. యువ‌త కేరింత‌ల‌తో ఈ దృశ్యాల‌ను సెల్ఫీలు తీస్తున్నారు.

ఆగ‌స్టు 15 సంద‌ర్భంగా స‌చివాల‌యం, అసెంబ్లీ ప్రాంగ‌ణాల్లో వేడుక‌లు నిర్వ హిస్తున్నారు. ఆదివారం ఉద‌యం 8గంట‌లకు అసెంబ్లీ భవనంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రోటెం చైర్మన్ వి.బాలసుబ్రహ్మణ్యం జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆలాగే ఉ.8.15 గం.లకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

సచివాలయం మొదటి భవనం వద్ద ఉ.7.30 గం.లకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. మొద‌టి బ్లాకులోనే సీఎం కార్యాల‌యం ఉంటుంది. దీనితో ఇక్క‌డ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు.

రాత్రి పూట స‌చివాల‌యాన్ని చూస్తే, మిరుమిట్లు గొలుపుతూ, ఎంతో సుంద‌రంగా ఉంద‌ని స‌చివాల‌య సిబ్బంది ముచ్చ‌ట‌ప‌డుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ పతాకం: హస్తినలో హై అలర్ట్