Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ జీ... వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్ కావాలి.. ఇది మనం చేయాలి... : ప్రధాని మోడీ

ఠాగూర్
శుక్రవారం, 2 మే 2025 (19:30 IST)
పవన్ కళ్యాణ్ గారూ ఇది మనం చేయాలి.. వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్ కావాలి. వికసిత ఏపీ కోసం స్వర్గీయ ఎన్టీఆర్ కలలుగన్నారు. మనమంతా కలిసి ఆయన కలల్ని నిజం చేయాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆయన సుధీర్ఘ ప్రసంగం చేశారు. తన ప్రసంగాన్ని ఆయన తెలుగులో ప్రారంభించారు. దుర్గాభవానీ కొలువైన ఈ పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్నారు. అమరావతి ఒక నగరం కాదన్నారు. ఒక శక్తి అన్నారు. 
 
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచిందన్నారు. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం రూ.3 వేల కోట్ల సాయం చేస్తోందన్నారు. ఇపుడు నేను ఈ పుణ్యభూమి అమరావతిపై నిలబడివున్నపుడు నాకు కనబడుతున్నది ఒక్క నగరం మాత్రమే కాదు... ఒక స్వప్నం సాకారం కాబోతుందనే భావన కలుగుతుందన్నారు. దాదాపు 60 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్టు తెలిపారు. 
 
పవన్ కళ్యాణ్‌కు బహుమతి ఇచ్చిన ప్రధాని మోడీ 
 
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ బహుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ సంఘటనతో సభావేదికపై కూర్చొన్న వారంతా కడుపుబ్బ నవ్వుకున్నారు. అమరావతి పునర్‌నిర్మాణ పనుల ప్రారంభోత్సవం శుక్రవారం అమరావతిలో జరిగింది. 
 
ఈ పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొని పనును బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా సభా వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముఖ్య నేతలందరూ సభా వేదికపై ఆశీనులై ఉండగా ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను తన వద్దకు పిలించారు. ప్రధాని ఎందుకు పిలిచారోనని పవన్ హడావుడిగా ఆయన వద్దకు వచ్చారు. 
 
అపుడు మోడీ తన వద్ద ఉన్న చాక్లెట్‌ను పవన్‌కు ఇవ్వడంతో వేదికపై నవ్వులు విరబూశాయి. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు నవ్వడంతో, పవన్‌ కూడా చేతిలో ఉన్న చాక్లెట్‌ను చూసుకుని వారితో కలిసి తాను కూడా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నతో మాట్లాడినా లింకులు పెట్టేస్తున్నారు.. రెండో పెళ్లి అంటూ ట్రోల్ చేస్తున్నారు... జాను వీడియో

అనిరుధ్ సంగీతానికి అభిమాని అయిపోయా : విజయ్ దేవరకొండ

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments