Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టెక్కిన అమరావతి రైతులు.. జనవరి 23న విచారణ

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (16:56 IST)
రాజధాని కోసం తమ సొంత భూములను ఇచ్చిన రైతులు న్యాయం కోరుతూ కోర్టుమెట్లెక్కారు. రాజధాని రైతు పరిరక్షణ సమితి ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ, జీఎన్ రావు కమిటి చట్టబద్ధతను తమ పిటిషన్‌లో వారు ప్రశ్నించారు. 
 
ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, వెంటనే విచారణ చేపట్టాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరారు. ప్రభుత్వం నుంచి వివరాలు అందలేదని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. తాజాగా నిన్నటి జీవోలో బీసీజీ నివేదికను ప్రభుత్వం ప్రస్తావించింది. బీసీజీ కమిటీని ఎప్పుడు, ఎవరు నియమించారని, నియమ నిబంధనలు చెప్పాలని పిటిషన్‌ తరపు లాయర్ కోరారు. 
 
ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చాక వివరాలు ఇస్తామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. జనవరి 21 నాటికి అందరూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. జనవరి 23న విచారణ చేపడతామన్న హైకోర్టు తెలిపింది. అలాగే, ఇప్పటికే అనేక మంది రైతులు వ్యక్తిగతంగా కూడా కోర్టును ఆశ్రయించిన విషయంతెల్సిందే. వీటన్నింటిపై కోర్టు విచారణ జరుపనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments