పామును ఆడిస్తూ... దాని కాటుతో వ్యక్తి మృతి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 19 జులై 2021 (09:57 IST)
ఓ ఇంటిలో పొంచి ఉన్న పామును పట్టుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించి పాము కాటుకు గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చీరాల మండల పరిధిలోని విజయనగర్‌ కాలనీలో చోటుచేసుకుంది.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన తేళ్ల కుమారి ఇంటిలో శనివారం ఉదయం గోడలో తాచుపాము కనిపించింది. పామును ఒక్కసారిగా చూసి ఉలిక్కి పడిన ఆమె స్థానికు ల సహాయంతో అదే ప్రాంతం యానాది కాలనీకు చెందిన పాములు ప ట్టే సంజయ్‌(42)కు పామును బయటకు తెచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సంజయ్‌ ఇంటిలో ఉన్న సామాను మొత్తం బయటకు చేర్చాడు. ఈక్రమంలో పాము బండ్ల కిందకు చేరింది. ఎట్టకేలకు సుమారు ఏడు గంటల సమయానికి పామును ప ట్టుకుని బయటకు తెచ్చాడు. ఈక్రమంలో పామును బయటకు తెచ్చి కోరలు తొలగించకుండా ఆడిస్తున్న క్రమంలో పాము కాటుకు గురయ్యా డు.

స్థానికులు వెంటనే అతడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు చేర్చగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడికి ఐదుగురు కు మార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. ఈపురుపాలెం పోలీ స్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments