Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో కలకలం.. నేలకేసి కొడితే బంతిలా ఎగురుతున్న కోడిగుడ్లు

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (10:10 IST)
నెల్లూరు జిల్లాలో కలకలం చెలరేగింది. నేలకేసిన కొట్టిన కోడి గుడ్డు ఒకటి బంతిలా పైకి ఎగిరింది. దీంతో ఆ గృహిణి బిత్తరపోయింది. ఆ తర్వాత ఆ గుడ్డు నకిలీదని తేలింది. అంటే జిల్లాలో నకిలీ కోడిగుడ్లు చెలామణి అవుతున్నట్టు తేలింది. గుడ్లు ఎంతకీ ఉడకకపోవడం, నేలకేసి కొడితే బంతిలా ఎగురుతుండడంతో అవి నకిలీ కోడిగుడ్లు అని కొనుగోలుదారులు ఓ నిర్ధారణకు వచ్చారు. 
 
జిల్లాలోని వరికుండపాడులో కొందరు వ్యక్తులు ఆటోల్లో తీసుకొచ్చి కోడిగుడ్లు విక్రయించారు. 30 కోడిగుడ్ల ధర రూ.180 కాగా, తాము రూ.130కి విక్రయిస్తున్నట్టు చెప్పడంతో జనం ఎగబడి కొనుగోలు చేశారు. వాటిని ఉడికించేందుకు ప్రయత్నించగా ఎంతకీ ఉడకకపోవడంతో అనుమానం వచ్చిన ఓ మహిళ వాటిని నేలకేసి కొట్టగా బంతిలా ఎగిరిపడ్డాయి. 
 
దీంతో అవి ప్లాస్టిక్ కోడిగుడ్లుగా భావించి వాటిని కట్ చేయగా లోపల పచ్చగా ఉన్న సొన తెల్లగా ప్లాస్టిక్‌లా ఉండడంతో తాము మోసపోయినట్టు గుర్తించారు. నకిలీ కోడిగుడ్ల వ్యవహారం కలకలం రేపడంతో స్పందించిన పశువైద్యాధికారి వాటిని పరిశీలించారు. వీటిని ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments