Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జిల్లాల ఏర్పాటు ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకం

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (13:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వివాదాస్పదమవుతుంది. తాజాగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ జీవో కూడా జారీచేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 26కు పెరగనున్నాయి. అయితే, ఈ జిల్లాల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ పేర్కొంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 
 
గుంటూరు జిల్లాకు చెందిన దొంతినేని విజయకుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బెజ్జి సిద్ధార్థం, ప్రకాశం జిల్లాకు చెందిన జాగర్లమూడి రామరావులు ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రపతి ఆమోదముద్ర లేకుండా కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యంకాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం విభజన చట్టంలో గుర్తించిన జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు గుర్తుచేశారు. ఈ జిల్లాల విభజన గతంలో చేపట్టిన ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని వారు గుర్తుచేస్తున్నారు. ఈ పిటిషన్లంటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments