Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం : సుప్రీంకోర్టులో పిల్ దాఖలు

ఠాగూర్
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (12:21 IST)
గత వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని ఉపయోగించారని నిజ నిర్ధారణ పరీక్షల్లో తేలింది. దీంతో దేశవ్యాప్తంగా భక్తులు, ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. న్యాయస్థానాల్లో వరుసగా పిటిషన్లు దాఖలవుతున్నాయి.
 
తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందుకు మరొక పిటిషన్ వచ్చింది. జంతు కొవ్వు కలిసిన నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించారనే ఆరోపణలపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హిందూ సేన అధ్యక్షుడు, రైతు సుర్జిత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. టీటీడీ లడ్డూ వ్యవహారంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
 
లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యిని ఉపయోగించి హిందువుల మనోభావాలను అగౌరవపరిచారని సుర్జిత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం హిందూ సమాజాన్ని తీవ్రంగా కలవర పెడుతోందన్నారు. సాధారణ ప్రజల ప్రయోజనం కోసమే తాను ఈ పిటిషన్‌ను దాఖలు చేశానని చెప్పారు. సాధారణ పౌరులు అందరూ కోర్టు తలుపు తట్టలేకపోవచ్చని, సరిగ్గా సన్నద్ధం కాకపోవడం, ఆర్థిక పరిస్థితి అనువుగా లేకపోవడం ఇందుకు కారణాలు కావొచ్చని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments