Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంచుకొస్తున్న పెథాయ్.. వణికిపోతున్న ఆంధ్రప్రదేశ్

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (09:38 IST)
పెథాయ్ తుఫాను దూసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెనుముప్పు పొంచివుంది. తిత్లీ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి ఇపుడిపుడే కోలుకుంటోంది. ఇపుడు మళ్లీ పెథాయ్ తుఫాను దూసుకొచ్చింది.
 
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారితీరం దాటనుంది. దీనికి ఫెథాయ్‌ తుఫానుగా నామకరణం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను మచిలీపట్నం కేంద్రానికి సుమారు 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
 
ప్రస్తుత పరిస్థితిని బట్టి ఒంగోలు నుంచి కాకినాడ మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తాలో ఏ ప్రాంతంలో తీరం దాటినా దాని ప్రభావం కృష్ణా జిల్లాపై ఉండే అవకాశం ఉంది. 
 
దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పొంచి ఉన్న ప్రకృతి విపత్తును ఎదుర్కొని ప్రాణనష్టం లేకుండా సమర్థంగా ఏర్పాట్లు చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. పెథాయ్ తుఫాను పెను తుఫానుగా మారితే గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
17వ తేదీ సాయంత్రానికి ఒంగోలు నుంచి కాకినాడ మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తుఫాను దిశ మార్చకుంటే దక్షిణ కోస్తా వైపు అంటే మచిలీపట్నం నుంచి నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశముందని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments