Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి అనుమతి.. భూమిపూజ

Webdunia
సోమవారం, 24 జులై 2023 (09:20 IST)
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంతింటి నిర్మాణానికి స్థానిక ప్రభుత్వ అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో ఇంటి నిర్మాణానికి స్థానిక టీడీపీ నేతలు భూమిపూజ చేశారు. గత కొంతకాలంగా చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గంలో సొంతిల్లు లేదంటూ వైకాపా నేతలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. వీరి నోటికి తాళం వేసేందుకు ఆయన సొంతిల్లును నిర్మించాలన్ని నిర్ణయించి, ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని అధికారులు ఇంతకాలం తొక్కిపెట్టి, తాజాగా అనుమతి ఇచ్చారు. 
 
దీంతో సొంత ఇంటిని నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో 99.77 సెంట్ల భూమిని గతంలో చంద్రబాబు సొంతంగా కొనుగోలు చేశారు. ఇది జాతీయ రహదారిని ఆనుకునివుంది. ఇందులో గృహ నిర్మాణం జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్నెల్ల క్రితం ఆయన దరఖాస్తు చేసుకోగా, ఇన్నాళ్లకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ నిర్మాణంతో సొంత నియోజకవర్గంలో సొంత ఇల్లు లేదన్న విమర్శలకు ఇక చెక్ పెట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments