Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి అనుమతి.. భూమిపూజ

Webdunia
సోమవారం, 24 జులై 2023 (09:20 IST)
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంతింటి నిర్మాణానికి స్థానిక ప్రభుత్వ అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో ఇంటి నిర్మాణానికి స్థానిక టీడీపీ నేతలు భూమిపూజ చేశారు. గత కొంతకాలంగా చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గంలో సొంతిల్లు లేదంటూ వైకాపా నేతలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. వీరి నోటికి తాళం వేసేందుకు ఆయన సొంతిల్లును నిర్మించాలన్ని నిర్ణయించి, ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని అధికారులు ఇంతకాలం తొక్కిపెట్టి, తాజాగా అనుమతి ఇచ్చారు. 
 
దీంతో సొంత ఇంటిని నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో 99.77 సెంట్ల భూమిని గతంలో చంద్రబాబు సొంతంగా కొనుగోలు చేశారు. ఇది జాతీయ రహదారిని ఆనుకునివుంది. ఇందులో గృహ నిర్మాణం జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్నెల్ల క్రితం ఆయన దరఖాస్తు చేసుకోగా, ఇన్నాళ్లకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ నిర్మాణంతో సొంత నియోజకవర్గంలో సొంత ఇల్లు లేదన్న విమర్శలకు ఇక చెక్ పెట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments