Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్నింగ్ వాక్ చేస్తున్న డీఐజీ ఫోనునే చోరీ చేశారు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 24 జులై 2023 (08:57 IST)
కొందరు దొంగలు.. తమ చేతివాటాన్ని బాగానే ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఓ డీఐజీ ఫోనును కొట్టేశారు. డీజీపీ మార్నింగ్ వాక్ చేసుతుండగా, ఈ చోరీ జరిగింది. ఈ ఘటన పోలీసు వర్గాలను విస్మయానికి గురిచేసింది. తలవంపులు తెచ్చిపెట్టింది. సాక్షాత్ ఓ రాష్ట్ర డీఐజీ ఫోనును కొట్టేయడం సిగ్గుచేటని పేర్కొంటున్నారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ రాష్ట్ర రాజధాని గౌహతిలో ఆదివారం వెలుగు చూసింది. ఈ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ విభాగం డీఐజీగా ఉన్న వివేక్ రాజ్ సింగ్ ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఆ సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు దొంగలు ఆయన ఫోనును లాక్కొని పారిపోయారు. ఈ ఘటన ఆ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలోవున్న మాజర్ రోడ్డులో జరిగింది. పైగా, ఆ రోడ్డు పక్కనే అనేక ఐపీఎస్ అధికారుల అధికారిక నివాసాలు కూడా ఉండటం గమనార్హం. 
 
ఈ చోరీ ఘటనపై గౌహతి పోలీస్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రీతిబీ రాజ్‌ఖోవా స్పందిస్తూ, ఈ ఘటన పల్టన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు. అయితే, ఈ చోరీ ఘటన పోలీసు శాఖకు తలవంపులు తెచ్చిపెట్టిందని కొందరు పోలీస్ ఉన్నతాధికారులు వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments