Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కిశోర బాలిక‌ల‌కు నెల‌కు 10 శానిట‌రీ న్యాప్ కిన్లు!

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (12:29 IST)
ఏపీలో సీఎం జగ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకుపోయే కార్య‌క్ర‌మాల‌కు విరివిగా డ‌బ్బు వెచ్చిస్తోంది. ఖ‌జానాలో డ‌బ్బు లేదు లేదుంటూనే, ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాలు మాత్రం కొత్త‌గా రూపొందిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా  ఏపీలో కిశోర బాలిక‌ల‌కు నెల‌కు 10 శానిట‌రీ న్యాప్ కిన్లు ఉచితంగా ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. 
 
ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో చదువుతున్న 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లను అందించే ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘‘7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు నెలకు 10 చొప్పున న్యాప్‌కిన్లు అందిస్తారు. బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ లక్ష్యం. వినియోగించిన న్యాప్‌కిన్లను డిస్పోజ్‌ చేసే పద్ధతులపై నోడల్‌ అధికారులు బాలికలకు అవగాహన కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఇన్సినరేటర్లు కూడా ఏర్పాటయ్యాయి’’ అని సీఎం జగన్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కల్కీ' బాక్సాఫీసు టార్గెట్ ఎంతంటే..!!

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ లో డైరెక్టర్ వివి వినాయక్ ఎంట్రీ

సెన్సేషనల్ నిర్ణయం ప్రకటించిన జానీ మాస్టర్

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments