నెగ్గిన వైసీపీ అవిశ్వాసం.... కాకినాడ మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ అవుట్!

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (12:16 IST)
కాకినాడ  మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పై అవిశ్వాసంలో  టి.డి.పి.కి  షాక్ త‌గిలింది. రెబల్  కార్పోరేటర్లు, టి.డి.పి  మేయర్ పై కౌన్సిల్ లో ప్రవేశపెట్టిన  అవిశ్వాసం గెలిచింది. మేయర్ పై అవిశ్వాసానికి  అనుకూలంగా 36 ఓట్లు,  అనుకూలంగా ఒక ఓటు  వచ్చాయి. అనుకున్నట్లుగానే  మేయర్  సుంకర పావని, మొదటి డిప్యూటీ మేయర్ సత్తిబాబులను పదవుల నుంచి 33 మంది  కార్పొరేటర్లు దించేశారు. దీనితో  వై.సి.పి  వ్యూహం ఫలించింది.
 
చివరి ఏడాది మేయర్ టి.డి.పి చేతిలో ఉండకూడదని వై.సి.పి. వేసిన‌ వ్యూహం  ఫలించింది.  మేయర్ పై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 36 మంది చేతులెత్తారు.  మంత్రి  కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా ఓటింగ్ లో  పాల్గొన్నారు. అంతకు ముందు తిరుగుబాటు కార్పొరేటర్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో సహకార శాఖ మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత  తోడు రాగా, కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వరకు పాదయాత్రగా తరలివచ్చారు. భారీ భద్రత నడుమ అవిశ్వాస తీర్మానం జరిగింది. తెలుగుదేశం పార్టీకి తొమ్మిది మంది కార్పొరేటర్లు మిగిలి ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నా, వారు ఎవరూ ఓటింగ్ ప్రక్రియకు రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments