Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు జగన్​ గురించి అర్థమైంది : చంద్రబాబు

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (18:23 IST)
ప్రజల గుండెల్లో నుంచి తెదేపాను తుడిచేయడం వైకాపాకు అసాధ్యమని.. తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆ పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

మండలిలో తెదేపా ఎమ్మెల్సీలు కోట గోడలా నిలబడి ప్రభుత్వ అనైతిక బిల్లులను అడ్డుకున్నారని అభినందించారు. 1984 నాటి పోరాటాన్ని ఎమ్మెల్సీలు తిరిగి గుర్తుచేశారని చంద్రబాబు అన్నారు. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

1984లో తెదేపా పోరాటాన్ని ప్రపంచం మొత్తం అభినందించిందని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీలకు ఆ అవకాశం వచ్చిందన్న ఆయన... ఎమ్మెల్సీలు విశ్వసనీయత, విలువలతో నిలబడ్డారని అభినందించారు.

రాజధానుల బిల్లుల వ్యవహారంలో నాటి పోరాటాన్ని గుర్తుచేసిన ఎమ్మెల్సీలను అభినందించారు. పార్టీ కోసం చేసిన త్యాగాలే చరిత్రలో నిలిచి ఉంటాయన్న చంద్రబాబు.. ప్రలోభాలకు లొంగిన వారు తెరమరుగవుతారని స్పష్టం చేశారు.

పార్టీ కోసం పోరాడేవాళ్లకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వాళ్లంతా చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments