Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న జాతిపిత.. నేడు సాయిబాబా... వైకాపా కేడర్ రంగుల పిచ్చి పీక్స్‌కు చేరింది...

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (14:37 IST)
నవ్యాంధ్రలో వైకాపా కార్యకర్తల పిచ్చి పీక్స్ చేరింది. ఫలితంగా ప్రభుత్వ భవనాలతో పాటు... మనుషులతో పాటు దేవుళ్లను కూడా వైకాపా కార్యకర్తలుగా చేసేస్తున్నారు. మొన్నటికిమొన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి వైకాపా రంగులు వేసిన వైకాపా కేడర్.. ఇపుడు సాయిబాబా విగ్రహానికి కూడా వైకాపా జెండా కప్పేశారు. 
 
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుడిలో ఉన్న శిరిడీ సాయిబాబా విగ్రహానికి వైసీపీ జెండాను కట్టారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూజారులు స్పందిస్తూ, మరుసటి రోజే జెండాను తొలగించామని చెప్పారు. ఇకపై ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ గడ్డపై ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
 
నిజానికి నవ్యాంధ్రలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ వైకాపా రంగులు వేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ జెండాకు, గాంధీ విగ్రహం దిమ్మెకు.... ఇలా అదీ, ఇదీ అనే తేడా లేకుండా రంగులు పూసేస్తున్నారు. తాజాగా సాయిబాబా విగ్రహానికి కూడా వైకాపా జెండా కప్పేశారు. అయితే, వీరి తీర్పు విపక్ష నేతలు ఎన్నో రకాలైన విమర్శలు గుప్పిస్తున్నా వైకాపా కేడర్ మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments