Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షిరిడి ఆలయంలో నిత్యం జరిగే కొన్ని కార్యక్రమాలు..

షిరిడి ఆలయంలో నిత్యం జరిగే కొన్ని కార్యక్రమాలు..
, బుధవారం, 24 ఏప్రియల్ 2019 (10:36 IST)
సాయిబాబా అంటే నచ్చని వారుండరు. స్వామివారికి చెప్పలేని సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఈ స్వామికి భారతదేశంలోనేకాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. భక్తులైతే ఉన్నారు కానీ, బాబా గురించి చాలామందికి తెలియనది ఆయన నిజమైన పేరు, పుట్టిన ప్రదేశం.. వీటి గురించి తెలియక చాలామంది పుస్తకాలు, పాత ఆర్టికల్స్ చదువుతుంటారు. 
 
పత్రి బాబా కాలంలో ఒక గ్రామం. కానీ నేడు ఒక సిటిగా, మున్సిపల్ కౌన్సిల్‌గా అవతరించింది. మహరాష్ట్రంలోని పర్భనీ జిల్లాలో పత్రి సిటీ ఉంది. ఈ సిటీ ప్రధాన ఆకర్షణ స్వామివారు జన్మించిన ఇంటిస్థానంలో కట్టిన శ్రీ సాయి జన్మస్థల టెంపుల్. ఈ మందిరాన్ని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలిస్తుంటారు. 
 
శ్రీ సాయి జన్మస్థాన ఆలయంలో షిర్డీ సాయిబాబా జన్మించెను. ఈ ప్రదేశాన్ని మొట్టమొదట సాయిబాబా భక్తులు, రీసెర్చర్ అయిన వి.బి.ఖేర్ 1975వ సంవత్సరంలో కనిపెట్టెను. ఈయన శ్రీ సాయి స్మారక కమిటీ ఏర్పాటు చేసి 1994లో పనులు మొదలుపెట్టి, 1999లో దీనిని జాతికి అంకితం చేసెను. ప్రముఖ స్వామీజీలైన పుట్టపర్తి సాయిబాబా, మాధవనాథ్‌లు కూడా 'పత్రి' నే సాయిబాబా జన్మస్థలంగా నిర్ధారించారు. 
 
షిర్డీ వెళ్లేవారు.. ఆలయం నిర్మించేటప్పుడు సాయిబాబా జన్మించిన ఇంట్లో దొరికిన వస్తువులు, పునాదులు, ఇతర పరికరాలను మందిర ప్రాంగణంలో చూడవచ్చును. 
 
ఆలయంలో నిత్యం జరిగే కొన్ని కార్యక్రమాలు..
కాకడ్ హారతి - ఉదయం 5 గంటల 15 నిమిషాలకు
మంగళ స్నానం, హారతి - ఉదయం 7 గంటలకు
మధ్యాహ్న హారతి - మధ్యాహ్నం 12 గంటలకు
సంజ్ హారతీ - సూర్యస్తమం సమయంలో
షెజారతి - రాత్రి 10 గంటలకు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24-04-2019 - బుధవారం మీ రాశిఫలితాలు - రావలసిన ధనం చేతికి అందడంతో