మృగాళ్ల‌ను శిక్షించేందుకు క‌ఠిన చ‌ట్టాలు అవ‌స‌రం

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (13:02 IST)
మ‌హిళ‌ల‌పై దురాగ‌తాల‌కు ఒడిగ‌డుగుతున్న మాన‌వ మృగాళ్ల‌ను శిక్షించేందుకు క‌ఠిన చ‌ట్టాలు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంద‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు.
 
 హైద‌రాబాదులో ప్రియాంకరెడ్డిపై అత్యాచారం, దారుణ హ‌త్య ఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ చిల‌కలూరిపేటలో ఎమ్మెల్యే ఆధ్వ‌ర్యంలో ఏఎంజీ విద్యార్థినులు, మ‌హిళ‌లు కొవ్వొత్తుల‌తో శాంతి ర్యాలీ నిర్వ‌హించారు. 
 
చిల‌క‌లూరిపేట ప‌ట్ణంలోని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌యం నుంచి న‌ర‌స‌రావుపేట సెంట‌ర్ మీదుగా గాంధీ విగ్ర‌హం వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రియాంక‌రెడ్డి హ‌త్య అత్యంత దారుణ‌మ‌న్నారు. నిందితులకు ప్ర‌జా కోర్టులో శిక్ష విధించాల‌ని కోరారు. 
 
ఈ సంద‌ర్భంగా కొవ్వొత్తుల‌తో శాంతి ర్యాలీ నిర్వ‌హించారు. ప్రియాంక రెడ్డి చిత్ర‌ప‌టాల‌తో ర్యాలీ సాగింది. గాంధీ బొమ్మ వర‌కు ర్యాలీ చేప‌ట్టారు. కొద్దిసేపు మౌనం పాటించారు. ప్రియాంక‌ రెడ్డి చిత్ర‌ప‌టాల‌కు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే వెంట పార్టీ నాయ‌కులు, ఏఎంజీ విద్యార్థినులు, ప‌లువురు మ‌హిళ‌లు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

Aari: అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు : డైరెక్టర్ జయశంకర్

మటన్ సూప్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా: డైరెక్టర్ వశిష్ట

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments