Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిగ్రీ కళాశాలల సమస్యల్ని తీర్చండి మ‌హాప్ర‌భో!

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (16:11 IST)
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు మొర‌పెట్టుకుంటున్నాయి. విజ‌య‌వాడ‌లోని ప్రసాదంపాడులో కళాశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ పోల భాస్కర్ కు పిడిఎస్ యు ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. రామ్మోహన్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయన్నారు. 
 
 
ముఖ్యంగా ఆది కవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో బుట్టాయిగూడెం, చింతూరు కేంద్రాల్లో గత నాలుగు సంవత్సరాల క్రితం స్థలం కేటాయించి భవనాల నిర్మాణం పూర్తి చేయలేదు. నిర్మాణాలు అసమగ్రంగా నిలిచి పోయాయ‌ని, వాటిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు, కొవ్వూరు డిగ్రీ కళాశాలలకు స్థలం కేటాయించి వెంటనే పూర్తిస్థాయి భవనాలు నిర్మించాలని అన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పక్కా భవనాలు, అదనపు తరగతి గదులు నిర్మించాలని కోరారు. డిగ్రీలో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాలని తెలిపారు. పశ్చిమ ఏజెన్సీ వెనుకబడ్డ బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పరీక్ష సెంటర్ కేటాయించాలని కమిషనర్ ను కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎ. రవిచంద్ర, నగర అధ్యక్షులు ఐ. రాజేష్ ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments